
              "రస హృదయ వశిష్టుడు" సినారె నిన్ననే ( 29 ) తేదిన 81 వ జన్మదినం
              జరుపుకున్నారు.ఆచార్యుడు,ప్రముఖకవి,సినీ గేయ రచయిత శ్రీ సి.నారాయణ
              రెడ్డిగారు తెలంగాణాలోని హనుమాజీపేట అనే చిన్న గ్రామంలో 1931లోజన్మించారు.
              సినారెగా పేరు గాంచిన ఆయన హైదరాబదు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు
              ప్రొఫెసరుగా పని చేస్తూనే తెలుగు సినీరంగంలోకి 1961లో గీత రచయితగా
              ఎన్.టి.ఆర్ "గులేబకావళి కధ" తో ప్రవేశించారు. మద్రాసులో నివాసం వుండకుండా
              హైదరాబాదులోనే వుంటూ శ్రీ శ్రీ, ఆత్రేయ, ఆరుద్ర లాంటి దిగ్గజాల మధ్య నిలబడి
              పాటల రచయితగా అసమాన ఖ్యాతి పొందారంటే సామాన్య విషయం కాదు. సినారె
              ప్రభంధక మాటలను తన సినీగేయ రచనలో పరిచయం చేశారు. ఆయన స్వయంగా
              మధురంగా పాడగలగటం మరో ప్లస్ పాయింట్ అయింది. "కర్పూర వసంతరాయలు"
              ఆయన మధుర స్వరంతో ఆలపించగా అమెరికాలోని ఆయన అభిమానులద్వారా
              లాంగ్ ప్లేయింగ్ రికార్డుగా అమెరికాలో తయారయి విడుదలచేయబడింది.ఆLP
              రికార్డు స్లీవ్ మీద ఆయన ఆటోగ్రాఫు తీసుకొనే అదృష్టం నాకు కలిగింది.

              సినారె లలిత గీతాలు, గేయ కావ్యాలు వ్రాశారు." ఈ నల్లని రాళ్ళలో ఏ కన్నులు
              దాగెనో, "సాగుమా ఓ నీల మేఘమా" మొదలయిన గీతాలు సినిమాకోసం వ్రాసినవి
              కావు. తరువాత వాటిని వివిధ సినిమాలలో ఉపయోగించడం జరిగింది. ఎన్.టి.ఆర్
              ద్వారానే సినిమా గేయ రచనా వ్యాసంగంలోకి ప్రవేశం జరిగిందని సినారె అన్నారు.
              1961లో "గులాబికావళి"చిత్రానికి అన్ని పాటలూ వ్రాశారు. శనివారం సాయంత్రం
              హైదరాబాదు నుండి మద్రాసుకు బయలుదేరి పాటలు వ్రాసి సోమవారం ఉదయం
              ఫ్లైట్ లోతిరిగి వచ్చి యునివర్సిటీలో ఆయన క్లాసులకు హాజరయ్యే వారంటే సినారె
              కార్య దీక్షత, సమయ పాలన అర్ధం చేసుకోవచ్చు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు.
              రచయిత గాయకుడే కాదు, మంచి వక్త. ఘజల్స్ అద్భుతంగా గానం చేసిన ఘనుడు.
              మొదటిసారిగా " మాయదారి చిన్నోడు నామనసే లాగేసిండు" పాటలో తెలంగాణా
              మాండలికాన్ని సినిమా గీతాలలో ప్రవేశపెట్టీ ప్రశంసలందుకున్నారు.
              
              ఆయన రాసిన ప్రఖ్యాత కావ్యరచనలు "కర్ఫూర వసంతరాయలు", "నాగార్జునసాగరం",
              "జాతిరత్నం", "ఋతుచక్రం" ,"విశ్వంభర", గేయ నాటికలు -"నవ్వని పువ్వు","అజంతా
              సుందరి", "వెన్నెలవాడ" మొదలయినవి. జ్ఞానపీఠ ఎవార్డు, పద్మవిభూషన్ అందుకున్నారు.
                                           సినారె చణుకులు
                   1990 లో తూర్పు గోదావరి జిల్లా రామవరంలో శ్రీ సినారెకి సన్మానంఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
                    చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
                    "మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
                    కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
                    సినారె !
                               మరొక చణుకు......
                    సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
                    వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
                    ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
                    సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
                    ప్రేమగా చలోక్తి విసిరారు.
                        
                         ఒకటి పిడికిలెత్తేది !
        సినారె కవితలు
                         ఉన్నాయి నాకు రెండు చేతులు
                         ఈ దేశంలో అందరికున్నట్లే
                         ఒకటి బిచ్చమెత్తేది
                         ఒకటి పిడికిలెత్తేది !
                    ఏర్పాటు చేశారు. ఆనాడు బ్రహ్మాండమైన ఏర్పాట్లను విశేష జనవాహినినీ
                    చూసిన ఓ వక్త "ఈ సభ మయసభను గుర్తు చేస్తున్నది" అని అన్నాడు.
                    "మయసభ" అంటే ఉన్నవి లేనట్లుగాను,లేనివి ఉన్నట్లుగానూ చూపించేది.
                    కాబట్టి ఈ సభను మయసభ అనవద్దు. "వాఞ్మయ సభ" అందాం అన్నారు
                    సినారె !
                               మరొక చణుకు......
                    సినారె ఇంటికి ఒక నియోగి ప్రముఖుడు, ఆయనతో ఓ వ్యాకరణ వేత్త
                    వచ్చారు.ఇద్దరు సినారెకు అత్యంత ఆత్మీయులు. సెలవు తీసుకొని వెడుతూ
                    ఇద్దరూ స్కూటర్ మీద కూర్చున్నారు. మిత్రులకు వీడ్కోలు చెబుతూ
                    సినారె " బాగుంది! ఈ జంట !! ముందు కరణం, వెనుక వ్యాకరణం అంటూ
                    ప్రేమగా చలోక్తి విసిరారు.
                        
                         ఒకటి పిడికిలెత్తేది !
        సినారె కవితలు
                         ఉన్నాయి నాకు రెండు చేతులు
                         ఈ దేశంలో అందరికున్నట్లే
                         ఒకటి బిచ్చమెత్తేది
                         ఒకటి పిడికిలెత్తేది !