
              శ్రీకాకుళం , కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలో గల శ్రీకాకుళేశ్వర స్వామి ఆలయం
              ఆంధ్రమహావిష్ణువు వెలసిన ఆలయంగా చెబుతారు.శ్రికాకుళం  అనే ఈ పేరుని విదేశీ
              వర్తకులు తమ వ్యాపారనిమిత్తం ఇక్కడకు వచ్చి ఈ ప్రాంతాన్ని సిరికొలని, సిరికి
              కొలనుగా పిలిచే వారట.  ఉత్తరాంధ్ర ప్రాంతంలో వున్న మరో జిల్లా ముఖ్యపట్టణం
              పేరు కూడా శ్రీకాకుళంగా పిలుస్తారు. బ్రిటిష్ పాలకులు ఈ ఊరిని చికాకోల్ అనే
              వారు మన భూమండలానికి కృష్ణాజిల్లాలో గల ఈ శ్రీకాకుళం మధ్య భాగమని
              శ్రీకాకుళం భూకేంద్రమనీ ఇక్కడ ఆది ద్వుడు "ఆంధ్రవిష్ణువుగా వెలిసాడని
              చెబుతారు . ఈఆలయం విశాలమైన ప్రాంగణంలొ మధ్యగా నిర్మాణం జరిగింది.
              ఈ ఆలయ గోపురం చోళరాజైన అనంతదండపాలుడు నిర్మించినట్లుగా చరిత్ర
              తెలియజేస్తున్నది.ఆలయ గోపురము పై సర్వధారి నమ సంవత్సరము 1081
              లో నిర్మాణము జరిగినట్లుగా శాసనం వ్రాసి వున్నది.  

బ్రహ్మగారు శ్రీమహావిష్ణువు కొరకు తపస్సు చేయగా వారి ఫూజలకు వీలుగా విష్ణువు 
              ఆర్చారూపుడుగా శ్రీవైఖానన మహర్షులచే ప్రతిష్టించబడ్డాడని ,శ్రీమన్నారాయణుడు
              వైకుంఠమునుండి ఆంధ్రవిష్ణువుగా వెలిసినట్టు క్షేత్రమహత్యంలో  వివరించారు.
              విజయనగర సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణదేవరాయలు కీ"శ" 1519లో శ్రీకాకుళాంధ్రదేవుని
              అర్చించాడని చెబుతారు స్వామివారి నిత్య ధూపదీప నైవేద్యములకై ఐదు గ్రామాలను
              సమర్పించాడని శాసనములద్వారా తెలుస్తుంది.

ఆలయప్రాంగణములొ విశ్రమించిన రాయలుకు కలలో శ్రీఆంద్రమహావిష్ణువు అగుపించి
              ఆంధ్రకావ్యమును రచించమని చెప్పినట్లు, అటుపిమ్మట ఆముక్తమాల్యద రచించినట్లు
              ఆ గ్రంధములో వ్రాశారు. ఈ ఆలయానికి ఆగ్నేయ మూలగా ఎత్తైన 16 స్థంబాల
              మంటపంలోనే కూర్చుని ఆ గ్రంధ రచన చేశారట. అందువల్ల ఈ మంటపానికి "ఆముక్త
              మాల్యద మంటపము" అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశఖ శుద్ధ
              దశమితో బ్రహ్మోత్సవాలు మొదలై పంచాహ్నిక దీక్షతో ముగుస్తాయి.













































 
 
 
 
 
 
 
 
 








