RSS
Facebook
Twitter

Saturday, 24 July 2010




ఈనాడు శ్రీధర్ కార్టూన్ల పుస్తకం
ఈనాడులో శ్రీ శ్రిధర్ గారి కార్టున్లు చూసినప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్
పుస్తకాలలా శ్రీధర్ గారి కార్టూన్ల పుస్తకం కూడా వెలువడితే బాగుండునని
చాలామంది ఆయన అభిమానులకు కలిగే వుంటుంది. ఈనాడు ఆగస్ట్,1999
లో ఈనాడు కార్టూన్లు శిధర్ పేరిట 10 X 8.5" సైజులో 214 పేజీలతో చక్కని
బైండు పుస్తకం రూ.70/-లకు విడుదలచేసింది. ఈనాడు పత్రికలో శ్రీధర్ 30
నవంబర్ 1982 నుండి 13 జూన్ 1999 వరకు వేసిన కార్టూనను
ఇందులో చూడొచ్చు. శ్రి ఆర్కే లక్ష్మన్ గారి తరువాత తెలుగులో రాజకీయ కార్టూనిస్ట్ గా
శ్రిధర్ ప్రధమ స్థానంలో నిలుస్తారనటంలో అతియోశక్తి లేదు.
శ్రీ రామోజీ రావు గారు పుస్త్రకంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు.
" నేను నాటి,పాదుచేసి, పెంచిన మొక్క గురించి ఏం చెప్పను? "ఈనాడు" ప్రాంగణంలో
నా కళ్ళ ముందే కార్టూన్ కల్పవృక్షం గా ఎదిగిన శ్రిధర్ గురించి ఎంతని చెప్పను? నాటి
నా ఆలొచనకు శ్రీధర్ లో అంతర్లీనంగా ఉన్న తపన, వృత్తిపట్ల అంకిత భావం తోడయ్యాయి.
ఇవాళ ఆర్.కె.లక్ష్మణ్ల్ లాంటి అగ్రశ్రేణి కార్టూనిస్టుల సరసన సుస్ధిర స్థానాన్ని శ్రీధర్ కు
సముపార్జించిపెట్టాయి. ఈనాడులో పుట్టి ఈనాడులో పెరిగిన శ్రిధర్ తో నా అనుబంధం-
తండ్రీబిడ్డల వాత్సల్యం. శ్రీధర్ లాంటి కార్టూనిస్ట్ "ఈనాడు"లో తయారయినందుకు
పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాను."
ఇక శ్రీధర్ ఇలా అంటారు, "స్కాములూ, అవినీతి, అసమర్ధతా, నిరుద్యోగం, కరవూ,
చెత్తా చెదారం, బాధలూ, నీటి కొరతా, కరెంటు కోతా, అధిక ధరలూ, పన్నులూ కొనసాగినంత
కాలం నవ్వక తప్పదు... అంటే ,జీవిత పర్యంతం నవ్వాలి. అదంతే- నవ్వండి !"
ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆనాటి ఫొటొ మరొ
సారి, మీ అందరికోసం.

Friday, 23 July 2010

బాపు రమణ బొమ్మల కధలు






మరో మంచి పుస్తకం - బాపు రమణ బొమ్మల కధలు
బాపు రమణలు 60 ఏళ్ళనుంచి చేసిన కళా (ధా) పోసన లన్నీ ఏర్చి కూర్చి ఒకే
పుస్తక రూపంలో రచన శాయిగారు తమ వాహిని బుక్ ట్రస్ట్ ద్వారా పెద్ద సైజులో
465 పేజీలతో ప్రచురించారు. తెలుగు పాఠకులకు ఇది పసందైన విందు. ఆంధ్ర
సచిత్ర వార పత్రిక, ఆంధ్రప్రభ వార పత్రిక,ఆంధ్రజ్యోతి వీక్లీ, చందమామ,యివ,జ్యొతి,
విజయచిత్ర ఇలా ఎన్నెన్నొ ప్రముఖ పత్రికలలోని అద్భుత రచనలను,బొమ్మల
కధలను చూస్తూ చదవొచ్చు. ఆనాటి చందమామలో బాపుగారు వేసిన రంగుల
గలివర్ ట్రావల్సు బొమ్మల కధ, ఆంధ్రవారపత్రికలో వేసిన, రైతూ-రాజు, బంగారం-
సింగారం , బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం ఖధ", బాపుగారు గీ(రా)సు
కున్న పెళ్ళిపుస్తకం,శ్రీ నాధ కవి సార్వభౌముడు స్క్రీన్ ప్లేలు ,చెప్పినడ్రాయింగ్
పాఠాలు, పంచతంత్రం బొమ్మల కధ అన్నీ అపురూపాలే.
495/-రూపాయలవిలువ గల ఈ పుస్తకం వాహిని బుక్ ట్రస్ట్,1-9-286
వుద్యానగర్, హైదరాబాద్- 500 04 వారి వద్ద దొరుకుతుంది.

Wednesday, 21 July 2010

గో గో గో !! గోమాత !!

ఆవు దూడను పూర్తిగా తాగనివ్వక దాని పాలు పూర్తిగా.
పిండుకుంటాము. మనది ఓ వేళ పాల వ్యాపారమైతే
అందులో నీళ్లు కలిపి అమ్ముకుంటాము. అన్యాయంగా
సంపాదించే వాళ్ళను "వాడు నానా గడ్డి తిని సంపాదించాడు"
అంటూ వుంటారు. ఫాలు పిండుకుంటే పిండుకున్నారు
ఆ ఆవుకు ఇంత దానాగా గడ్డి వేయరు. పాలు తిసుకున్నాక
వాటిని రోడ్డు మీదకు తోలుతారు. పాపం అవి కార్పొరేషన్
చెత్త కుండీలలోని నానా చెత్త తింటాయి. ప్లాస్టిక్ సంచుల్లో
ఉంచి పారేసిన కూరగాయల తొక్కును ఆ సంచుల్తో పాటు
నములుతాయి. ఆ ప్లాస్టిక్ అరగక వాటికి ఎన్ని జబ్బులో!
గోవును పూజించడం మన సంప్రదాయం. చెత్త కుండీ దగ్గర
ఆవు కనిపించగానే ,అక్కడ ఎంత దుర్ఘ్హంధంగా వున్నా సరే
వెళ్ళి తోకకు ఓ దండం పెడతారు. ఢిల్లీ లో సుల్తాన్పూర్ బర్డ్
సాంక్చ్యురీ దగ్గర ఎండిన చెరువులోని ఓ రకం చేప కళేబరాన్ని
తింటున్న ఓ ఆవు ఫొటోని "ఇండియా టుడే" పత్రిక ఇటీవలే
ప్రచురించింది. అంటె ఆవులు కూడా మాంసాహార జంతువులుగా
మారిఫొయేటట్లు ఛెస్తున్నామన్నమాట. అదే ఆ పై ఫొటో.
గోవు మాలచ్చిమిని నీ దేవతంటావు
పాలు తీసుకొని రోడ్డు పైకి గోగో అంటూ తోలుతుంటావు !!
మునిసిపాలిటీల నానా చెత్త తింటుంటే ఆ ఆవు
చూసి తోకకో దండమెడతావు!! నోటికో పండందించలేవు !!
ఫోటో : ఇండియా టుడే సౌజన్యంతో




హాస్య రచయిత శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం ప్రధమాంధ్ర
రచయితల్లో ప్రముఖవ్యక్తి. ఆయన తన ఇరవై రెండో ఏట
మొదటి రచన చేశారు. ఆయన 1889లో రచించిన "గయో
పాఖ్యానం" నాటిక వందేళ్ళు పైగా ప్రదర్శించబడింది. కందుకూరి
తో బాటు ప్రముఖులంతా ఈ నాటికలో పాత్రలను పోషించారు.
శ్రీ చిలకమర్తి గీతామంజరి, కృపాంబోనిధి, మొదలైన శతకాలు,
సరస్వతి,మనోరమ,దేశమాత పత్రికలను నిర్వహించారు. ఆయన
వ్రాసిన "గణపతి" హాస్య నవల కడుబుబ్బ నవ్విస్తుంది. 1967లొ
ఆకాశవాణి విజయవాడ కేద్రం గణపతి నవలను రేడియో నాటకంగా
మార్పుచేసి ప్రసారం చేసి నప్పటినుంచి ఎన్నోసార్లు పున ప్రసారమయింది.
ఈనాటికను ఆకాశవాణి వారు ఆడియో సిడీగా విడుదల చేశారు.
ఇందులో గణపతిగా నండూరి సుబ్బారావు,అతని తల్లి సింగమ్మగా
పి .సీతారత్నమ్మ, పంతులుగారిగా పుచ్చాపూర్ణానందం మొదలైనవారు
నటించారు. ఈ సీడీ అమ్మకానికి ఆకాశకేంద్రాల వద్ద లభిస్తుంది.
" భరత ఖండంబు, చక్కని పాడియావు
హిందువులు, లేగదూడలై ఏద్చు చుండ
తెల్లవారను, గడుసరి గొల్లవారు
పిదుకుచున్నారు, మూతులు బిగియగట్టి" అని చిలకమర్తి విదేశీ
పాలనపై ఓ పద్యం వ్రాశారు. ఇక్కడ హిందువులు అంటే ఒక మతం
గురించి ఆయన ప్రస్తావించడం కాదని మనం గ్రహించాలి. ఆ కాలంలో
మన దేశాన్ని హిందూదేశం అనే పిలిచేవారు. మనం తెలుగోళ్ళం కాబట్టి
ఆ మధ్య కొందరు తెలుగోళ్ళు ఈ పద్యం చిలకమర్తి స్వంతం కాదని ఓ
రగడ చేశారు. ‘ఛిలకమర్తి 1867 సెప్టెంబర్ 26న రాజమండ్రిలో జన్మించారు

Monday, 19 July 2010

టూ(టీ)త్ పేస్ట్ కబుర్లు




ఉదయాన్నే లేవగానే మనం బ్రష్ చేసుకొంటాము, సారీ, బ్రష్ చేసుకోవటమెందుకు
మనకు మార్కెట్లో ఎన్నో రకాల టూత్ బ్రష్షులు దొరుకుతున్నప్పుడు. ఐనా మనకు
అదేమిటో బ్రష్ చేసుకోవడమనే మాట అలవాటయింది. బ్రష్ ఉంటే చాలదు కదా
తోముకోడానికి పేష్ట్ కావాలి. నాకో సందేహం వస్తుంటుంది. టూత్ పేస్ట్,టూత్ బ్రష్ష్
అని అంటారు. టూత్ అంటే ఒక పన్నని అర్ధంకదా. ఆ ఒక పన్ను తోముకోడానికి
వీటవసరమే ఉండదుకదా. ప్రతి మనిషికి 32 పళ్ళుంటాయి. మరి టీత్ పేస్ట్ అని
ఎందుకనరో ! ఈ దేహానికి ఇలాంటి సందేహాలు వస్తూనే ఉంటాయి. మా చిన్నతనం
లో GIBBS S.R.TOOTH PASTE అని వచ్చేది. ఇప్పటిలా ట్యూబ్లలోనే కాకుండా
గుండ్రని డబ్బాల్లో , ఈ నాటి ఆడవాళ్ళ మేకప్ పౌడర్ కేకుల్లా అన్న మాట. ఓక్కొక్కరికి
ఒకటి చొప్పున వాడల్సి వచ్చేది. రకరకాల బ్రాండుల్లో ఎన్నెన్నో పేస్టులు, పౌడర్లు ఇప్పుడు
వస్తున్నాయి. నీమ్,కాల్గేట్,మెక్లీన్స్,క్లోజప్,పెప్సొడెన్ట్, బినాకా ఇలా ఎన్నేన్నో. మేం ఆ
రోజుల్లో బినాకా టూత్ పేస్టంటె ఇష్టపడటానికి కారణం. పేస్ట్ బాక్సులో ఒక్కోసారి ఒక్కో
జంతువుల బొమ్మల్ని పెట్టెవాళ్ళు. కొంతకాలం TRANSFER PICTURES పెట్టే వారు.
ఆ రోజుల్లో బినాకా అంత ప్రాచూర్యాణ్ణి పొందటానికి కారణం, రేడియో సిలోన్లో ప్రతి భుధ
వారం రాత్రి 8 గంటలకు శ్రీ అమీన్ సయానీ నిర్వహించే హిందీ సినిమాల బినాకా గీత్
మాల. ఆ ప్రోగ్రాం కోసం ఎప్పుడు భుధవారం వస్తుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే
వారు. ఇక టూత్పేస్టుల ప్రకటనలు తమాషాగా ఉంటున్నాయి. పిల్లవాణ్ణీ డెంటిస్ట్ దగ్గరకు
తీసుకెళ్ళిన తండ్రిని ఏ టూత్ పేస్ట్ వాడుతున్నారు అని అడిగితే "చవకరకం" అని అమా
యకంగా ముఖంపెట్టి జవాబివ్వడం,, అమ్మాయి, అబ్బాయి దగ్గరగా రా,దగ్గరగా రా అని
పాడుతూ పిలిచే క్లోజప్ ప్రకటన ఛూసారుగా. ఇప్పూడు కాల్గేట్ వాళ్ళు ఈటీవీలో పాడుతా
తీయగా ని స్పాన్సార్ చేస్తున్నారు.
చివరిగా మొట్టమొట్టదట టూత్బ్రష్ ని కొన్నదేవరో తెలియదుగాని, కనుక్కోన్నది
మాత్రం 1780 లో వియం ఆడిస్ అనే పెద్దమనిషట. బినాకా టూత్ పేస్ట్ తో నే సేకరించిన
బొమ్మలు చూడండి. ఆ నాటి అమీన్ సయాని బినాకా గీత్ మాలా కాసెట్ HMV వారు
విడుదల చేసారు.
టూత్పేస్టుల్లో ఎర్రవి,నీలంవి, చారలవి, పారదర్శకం వీ ఇలా ఎన్నోరకాలు.ఈప్పుడెమో
పిల్లలకూ ప్రత్యేకంగా వస్తున్నాయి. ఇలా ఎన్నో వ్యాపార చిట్కాలు !!
  • Blogger news

  • Blogroll

  • About