RSS
Facebook
Twitter

Tuesday, 14 December 2010






కమేరామాన్, దర్శకుడు, విక్రమ్ ఫిలిమ్స్ అధిపతి శ్రీ బిందినగబవాలే శ్రీనివాస్
అయ్యంగార్ తన 93వ ఏట చెన్నైలో కన్నుమూశారన్న వార్త "తెనాలి రామకృష్ణ"
"అమరశిల్పి జక్కన" చిత్రాల అభిమాన ప్రేక్షకులకు బాధాకరమైన వార్త. ఎన్టీఆర్,
ఏయన్నార్, శివాజీ గణేశన్, ఎమ్జీయార్, రాజ్ కుమార్ లాంటి ప్రముఖ నటులు
ఆయన దర్శకత్వం లో నటించారు. "లైలామజ్ఞు", "దేవదాస్" లాంటి చిత్రాలకు
ఆయన చాయాచిత్ర దర్శకత్వం వహించారు. ఆయన చిత్రాలకు ప్రభుత్వ బహు
మతులు పొందాయి. "తెనాలి రామకృష్ణ" లోని పాటలు, పద్యాలు, "అమరశిల్పి
జక్కన" చిత్రం లోని "ఈ నల్లని రాలలో" పాటలు మర్చిపోగలమా?! "
శ్రీ బి.ఎస్.రంగా శ్రర్ధాంజలి ఘటిస్తూ.......,

Monday, 13 December 2010


1950 జూన్లో మొదటి సారిగా ప్రచురించబడ్డ శ్రీశ్రీ "మహాప్రస్ఠానం" ఈ ఏడాది
60 సంవత్సరాలు పూర్తి చేసుకొని షష్టి పూర్తి చేసుకొంటున్నది ! తెలుగులో
ఇప్పటికి 30 సార్లు పునర్ముద్రణకు నోచుకొన్న పుస్తకం ఇదే కావొచ్చు.
మహప్రస్థానం పుస్తకానికి "యోగ్యతాపత్రం" పేరిట ముందు మాటను ప్రఖ్యాత
రచయిత చలం జూలై 17, 1940 లోనే వ్రాశారు. కాని పుస్తకం విడుదలయింది
పదేళ్ళ తరువాత ! ఇందులోని ప్రతి కవిత వేగంగా సాగిపోతుంది. కమ్యూనిజానికి
ఆకర్షితులైన వాళ్ళే కాకుండా , ప్రతి ఒక్కరు ఈ కవితలను అమితంగా ఇష్టపడ్డారు.
తన కవితలను శ్రిశ్రీ తన మితృడు కొంపెల్ల జనార్దనరావుకు అంకితమిచ్చారు.
మరో ప్రపంచం,
మరో ప్రపంచం,
మరో ప్రపంచం పిలిచింది !
పదండి ముందుకు,
పదండి త్రోసుకు !
పోదాం, పోదాం పైపైకి ! అంటూ పాఠకుల్ని ప్రతి కవితా ముందుకు త్రోసుకొని
పోతుంది. పాఠక హృదయాల్లో శ్రీశ్రీ చిరంజీవి! శ్రీశ్రీ ఈ కవితల్ని"Three cheers
for Man" పేరిట స్వయంగా ఇంగ్లీషులోకి అనువాదం చేసి 1956లో ప్రచురించారు.

Sunday, 12 December 2010

నిద్ర పోరా తమ్ముడా!





రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా,
డబ్బు జబ్బు చేసినవాళ్ళకీ, నిద్ర పట్టదు. కొందరు ఆ నిద్రకోసం నిద్ర మాత్రలు
వాడుతుంటారు. ఆకలి రుచెరెగదు , నిద్ర సుఖమెరుగదు అంటారు కదా! బాగా
పని చేసాక గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకొని పడు
కున్నా మనకు ఒకోసారి నిద్ర రానే రాదు. అదే చూడండి, ఆరుబయట కాయ
కష్టం చేసుకొనే వాళ్ళు రోడ్డు ప్రక్కనున్న ఇసుక గుట్టమీద, కంకరరాళ్ళమీద
పడుకున్నా ఇట్టె సుఖంగా నిద్రపోతారు. నాకు పుస్తకం చదివుతుంటే నిద్ర రాదు
గానీ టీవీ చూస్తుంటె మాత్రం భలే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర వస్తే పోయి పడుకో
రాదా అని శ్రీమతి అంటే మంచం మీదకు చేరగానే చస్తే నిద్ర పట్టదు. కొంతమంది
ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లోనిద్ర పోతుంటారు.
" రాత్రంతా నిద్రలేదు సార్" అని ఆఫీసరుతో గుమస్తా గుర్నాధం అంటే "ఏవిటీ?
నువ్వు ఇంట్లోకూడా నిద్ర పోతావా? ! " అని ఆశ్సర్య పోయాడట ఆఫీసర్ ఆనంద
రావు. నిద్ర మీద నిద్ర పట్టక మేధావులు మేలుకొని ఆ టైములో నిద్ర మీద కొన్ని
నానుడులు చెప్పారు!
" నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?"
" నిద్ర పోయినవాణ్ణి లేప వచ్చు కానీ మేలుకున్న వాణ్ణి ఎవరూ లేపలేరు "
" నిద్రపోయిన వాడి కాళ్ళకు మొక్కినట్లు"
ఇక సినిమాల్లోనూ నిద్ర మీద ఎన్నో మంచి పాటలొఛ్ఛాయి. లతామంగేష్కర్
తెలుగులో సంతానం చిత్రంలో పాడిన తొలి పాట,’" నిదురపోరా తమ్ముడా!,నిదురలోన
గతమునంతా నిముషమైనా మరిచిపోరా " వింటుంటే అలా నిద్రలోకి జారిపోతాం!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "రాజమకుటం" చిత్రానికి వ్రాసిన " సడిసేయ కో గాలి! సడిసేయ
బోకే! బడిలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే ", ఆత్రేయ "మూగమనసులు" చిత్రానికి
వ్రాసిన " పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా", సినారె
"ధనమా-దైవమా" చిత్రానికి వ్రాసిన " నీ మది చల్లగా స్వామీ నిదురపో,దేవుని నీడలో
వేదన మరచిపో-నీ మది చల్లగా,, "జీవనజ్యోతి" చిత్రానికి " ముద్దుల మా బాబు నిద్ద
రోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు.." ,"సూత్రధారులు" చిత్రం లో ఆయనే
వ్రాసిన " జోలాజోలమ్మ జోలా, జేజేలా జోల"ఇవి కొన్ని నిద్ర పాటలకు ఉదాహరణలు..
కొందరు వాళ్ళు చెయ్యాలనుకున్న పని పూర్తయేదాకా నిద్ర పోమంటారు. నారా
చంద్రబాబు నాయుడు గారు ఉద్యొగులతో "నే నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను"
అంటూ వుండే వారు. ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి వన వాసం నుంచి వచ్చేదాకా నిద్ర
పోతూ నే వున్నదట! ఇక నిద్ర పొతే ఒక పట్టాన లేవని వాళ్ళను కుంభకర్ణ నిద్ర
అంటారు. పరీక్షల రోజుల్లో నిద్ర రాకుండా వుండటానికి టీ తాగుతూ నిద్ర ఆపుకుంటూ
వుంటారు. నిద్ర గురించి రాస్తుంటె నిద్ర ముంచు కొస్తున్నది. నిద్ర మత్తు వదలటానికి
కొన్ని నిద్ర జోకులు చెప్పుకుందామా మరి !


>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<


కుంభకర్ణుడితో రాక్షసులు - " ఏమండోయ్, నిదుర లేవండోయ్"
<><><><><><><><><><><>
" అదేమిటొయ్-ఈ మధ్య బొత్తిగా మరీ అలా గుర్రు పెడుతున్నావు ?"
" నాకిలాగే వచ్చు, నచ్చకపోతే వినకు."
<><><><><><><><><><><><><>
ఒకావిడ డాక్టరు దగ్గరికి వెళ్ళి " మావారికి కలవరింతలండీ, చంపేస్తున్నారు" అంది
" మందిస్తాను పట్టుకెళ్ళండి అవే పోతాయి..."
" అబ్బే పోవడానికివ్వకండి. కాస్త స్పష్టంగా మాట తెలిసేలా కలవరించడానికి
మందివ్వండి.... ఆ పిల్ల పేరు తెలీటం లేదు"
<><><><><><><><><><><><><><><>
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో


Saturday, 11 December 2010


గత చిత్రాలలో హాస్య సన్నివేశాలు, వాటిలోని పాత్రలు కధనంలో మిలితమయి
వుండేవి. సినిమా చూసి ఇంటికి వచ్చాక ఆ దృశ్యాలను గుర్తుకు తెచ్చుకొని
నవ్వికొనే వాళ్ళం! ఆ నవ్వుల ఘట్టాలు కలకాలం గుర్తుండిపోయేవి. వాటి
కోసమే సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ హాల్ల ముందు బారులు తీరే వారు.
ఇప్పటి సినిమాల్లో శృంగార దృశ్యాలనే కాదు హాస్యం కూడా జుగుప్సాకరంగా
వుంటున్నది. రేలంగి, రమణారెడ్డి మమా అళ్లుల్లుగా "ఇల్లరికం" సినిమాలో
తలచుకుంటేనె నవ్వ లేకుండా వుండ లేము. "ఇల్లరికం" చిత్రంలోని రేలంగి,
రమణారెడ్డి పాత్రలను శ్రీ బాపు ఆ చిత్ర ప్రచారానికి ఎంత అద్భుతంగా గీసారో
పై బొమ్మ చూస్తే తెలుస్తుంది !!

Friday, 10 December 2010

బాపు - రమణ -బొమ్మలు - కధలు





శ్రీ బాపు, ముళ్లపూడి వెంకట రమణ గార్లు కలసి మెలసి 60 ఏళ్ళ
క్రితం ( పత్రికా లోకంలో స్వర్ణ యుగమనే చెప్పాలి) వివిధ పత్రికలలో
గీసి రాసిన ఆణిముత్యాలన్నీ పుట్టల్లాంటి పెట్టెల్లోంచి త్రవ్వి తీసి
464 పేజీల గట్టి " అట్ట " హాసం తో "మంద " హాసంగా అచ్చొత్తి
రచన శాయి గారు అభిమానులకు అందించారు. 1960 ల నుంచి
90 లదాకా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ,విజయచిత్ర,యువ,
జ్యొతి మాస పత్రిక, లలో ప్రచురించిన ఈ ఇద్దరుమితృల బొమ్మల
కధలను ఆస్వాదించవచ్చు. చందమామ లో బాపు వేసిన "’గలివర్
ట్రావల్స్" రంగుల బొమ్మల కధ, బంగారం-సింగారం, బుడుగు,రాజూ-
రైతు,బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం" కధ ఇలా ఒకటేమిటి
ఎన్నోఎన్నేన్నో! భాపు బొమ్మలతో గీసిన సినిమా స్క్రిప్ట్ మరెన్నో!!
ఈ పుస్తకం మీ దగ్గర లేపొతే వెంటనే వాహిని బుక్ ట్రస్ట్, 1.9.286/3,
విద్యానగర్, హైదరాబాద్ 500044 కు వెంఠనే వ్రాసి తెప్పించుకొనండి!
మరో మాటండోయ్! ఈ విలువైన పుస్తకం ఆఖరి పేజీలో నా పేరూ చోటు
చేసుకుందోచ్ !!, ప్రముఖులతో బాటు.
  • Blogger news

  • Blogroll

  • About