

రాత్రవగానే మనం నిద్ర పోతాం. కొందరికి నిద్ర పట్టదు.ఆ లోచనలు ఎక్కువైనా,
డబ్బు జబ్బు చేసినవాళ్ళకీ, నిద్ర పట్టదు. కొందరు ఆ నిద్రకోసం నిద్ర మాత్రలు
వాడుతుంటారు. ఆకలి రుచెరెగదు , నిద్ర సుఖమెరుగదు అంటారు కదా! బాగా
పని చేసాక గాఢ నిద్ర పడుతుంది. ఇంట్లో హాయిగా మెత్తని పరుపేసుకొని పడు
కున్నా మనకు ఒకోసారి నిద్ర రానే రాదు. అదే చూడండి, ఆరుబయట కాయ
కష్టం చేసుకొనే వాళ్ళు రోడ్డు ప్రక్కనున్న ఇసుక గుట్టమీద, కంకరరాళ్ళమీద
పడుకున్నా ఇట్టె సుఖంగా నిద్రపోతారు. నాకు పుస్తకం చదివుతుంటే నిద్ర రాదు
గానీ టీవీ చూస్తుంటె మాత్రం భలే నిద్ర ముంచుకొస్తుంది. నిద్ర వస్తే పోయి పడుకో
రాదా అని శ్రీమతి అంటే మంచం మీదకు చేరగానే చస్తే నిద్ర పట్టదు. కొంతమంది
ఉద్యోగులు హాయిగా ఆఫీసుల్లోనిద్ర పోతుంటారు.
" రాత్రంతా నిద్రలేదు సార్" అని ఆఫీసరుతో గుమస్తా గుర్నాధం అంటే "ఏవిటీ?
నువ్వు ఇంట్లోకూడా నిద్ర పోతావా? ! " అని ఆశ్సర్య పోయాడట ఆఫీసర్ ఆనంద
రావు. నిద్ర మీద నిద్ర పట్టక మేధావులు మేలుకొని ఆ టైములో నిద్ర మీద కొన్ని
నానుడులు చెప్పారు!
" నిద్ర చెడుతుందని నల్లి కుట్టకుండునా?"
" నిద్ర పోయినవాణ్ణి లేప వచ్చు కానీ మేలుకున్న వాణ్ణి ఎవరూ లేపలేరు "
" నిద్రపోయిన వాడి కాళ్ళకు మొక్కినట్లు"
ఇక సినిమాల్లోనూ నిద్ర మీద ఎన్నో మంచి పాటలొఛ్ఛాయి. లతామంగేష్కర్
తెలుగులో సంతానం చిత్రంలో పాడిన తొలి పాట,’" నిదురపోరా తమ్ముడా!,నిదురలోన
గతమునంతా నిముషమైనా మరిచిపోరా " వింటుంటే అలా నిద్రలోకి జారిపోతాం!
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు "రాజమకుటం" చిత్రానికి వ్రాసిన " సడిసేయ కో గాలి! సడిసేయ
బోకే! బడిలి ఒడిలో రాజు పవళించేనే సడిసేయకే ", ఆత్రేయ "మూగమనసులు" చిత్రానికి
వ్రాసిన " పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా బంగారు తల్లిగా", సినారె
"ధనమా-దైవమా" చిత్రానికి వ్రాసిన " నీ మది చల్లగా స్వామీ నిదురపో,దేవుని నీడలో
వేదన మరచిపో-నీ మది చల్లగా,, "జీవనజ్యోతి" చిత్రానికి " ముద్దుల మా బాబు నిద్ద
రోతున్నాడు సద్దు చేశారంటే ఉలికులికి పడతాడు.." ,"సూత్రధారులు" చిత్రం లో ఆయనే
వ్రాసిన " జోలాజోలమ్మ జోలా, జేజేలా జోల"ఇవి కొన్ని నిద్ర పాటలకు ఉదాహరణలు..
కొందరు వాళ్ళు చెయ్యాలనుకున్న పని పూర్తయేదాకా నిద్ర పోమంటారు. నారా
చంద్రబాబు నాయుడు గారు ఉద్యొగులతో "నే నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను"
అంటూ వుండే వారు. ఊర్మిళాదేవి లక్ష్మణస్వామి వన వాసం నుంచి వచ్చేదాకా నిద్ర
పోతూ నే వున్నదట! ఇక నిద్ర పొతే ఒక పట్టాన లేవని వాళ్ళను కుంభకర్ణ నిద్ర
అంటారు. పరీక్షల రోజుల్లో నిద్ర రాకుండా వుండటానికి టీ తాగుతూ నిద్ర ఆపుకుంటూ
వుంటారు. నిద్ర గురించి రాస్తుంటె నిద్ర ముంచు కొస్తున్నది. నిద్ర మత్తు వదలటానికి
కొన్ని నిద్ర జోకులు చెప్పుకుందామా మరి !
>>>>>>>>>>>>>>>>>>><<<<<<<<<<<<<<<<<<<<<
కుంభకర్ణుడితో రాక్షసులు - " ఏమండోయ్, నిదుర లేవండోయ్"
<><><><><><><><><><><>
" అదేమిటొయ్-ఈ మధ్య బొత్తిగా మరీ అలా గుర్రు పెడుతున్నావు ?"
" నాకిలాగే వచ్చు, నచ్చకపోతే వినకు."
<><><><><><><><><><><><><>
ఒకావిడ డాక్టరు దగ్గరికి వెళ్ళి " మావారికి కలవరింతలండీ, చంపేస్తున్నారు" అంది
" మందిస్తాను పట్టుకెళ్ళండి అవే పోతాయి..."
" అబ్బే పోవడానికివ్వకండి. కాస్త స్పష్టంగా మాట తెలిసేలా కలవరించడానికి
మందివ్వండి.... ఆ పిల్ల పేరు తెలీటం లేదు"
<><><><><><><><><><><><><><><>
శ్రీ ముళ్లపూడి వెంకట రమణ గారి "నవ్వితే నవ్వండి" సౌజన్యంతో