RSS
Facebook
Twitter

Wednesday, 9 March 2011

జపాన్ లో మన శ్రీధర్





మన తెలుగు కార్టూనిస్టులు చాలా మంది విదేశాల్లో కూడా ఎన్నో కార్టూన్
ప్రదర్శనలలో పాల్గొని బహుమతులు ప్రశంసలు పొందారు. ఈనాడు కార్టూనిస్ట్
శ్రీధర్, జపాన్ కార్టూనిస్ట్స్ అసొసియేషన్ సహకారంతో "జపాన్ ఫౌండేషన్
ఫోరమ్" 1955లో జపాన్లో Asian Cartoon Exhibition ఏర్పాటు చేసిన.
ప్రదర్శనలో మన దేశం తరఫున పాల్గొన్నారు. మన దేశంతో బాటు పదకొండు
దేశాల కార్టూనిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జపాన్ ఫౌండేషన్ ఆహ్వానం
అందుకొని అప్పుడు శ్రీధర్ జపాన్ వెళ్ళి వచ్చారు. మన ఆశియా మహిళలు
అనే శీర్షిక మీద స్త్రీల సమస్యలపై శ్రీధర్ సంధించిన వ్యంగాస్త్రాలుగా ఈ కార్టూన్లు
కలకాలం నిలచి పొతాయి. ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమోహన్ .నిర్వహించే
స్మైల్ పత్రికను నిన్న మరోసారి చూస్తుండగా అందులో అగుపడ్డ శ్రీధర్ కార్టూన్లు,
(నిన్ననే మనం మహిళాదినోత్సవం జరుపుకొన్నాము) చూసి మీతో పంచుకోవాలని
మీ ముందు వుంచుతున్నాను.
Courtesy: Sri Syammohan's "SMILE"

Tuesday, 8 March 2011

బొమ్మల కధలు





విదేశాల్లో బొమ్మల కధల పుస్తకాల్లు కోకొల్లలు. డిసీ కామిక్స్ లాంటి
ఎన్నెన్నో బొమ్మల కధల పుస్తకాలు అక్కడి పిల్లలను, పెద్దలను విశేషంగా
ఆకర్షించాయి. అవే పుస్తకాలు మన దేశంలోనూ దిగుమతిఅయ్యాయి.
ఆకధలన్నీ సూపర్ మాన్, స్పైడర్ మాన్ లాంటి కధలు! ఆ తరువాత
ఆ కధలే సినిమలుగానూ వచ్చాయి. మన దేశంలోని పిల్లలు ఆ బొమ్మల
కధలను చదవడానికే ఎక్కువ ఇష్టపడటం మొదలెట్టారు. విదేశాల్లో
కూడా పిల్లలు వాటితో బాటు క్లాసిక్స్ ను కూడా చదివే అలవాటు
చేయడానికి క్లాసిక్స్ ఇల్లస్ట్రేటెడ్ పేరిట ప్రసిద్ధ రచయితల కౌంట్ ఆఫ మాంటో
క్రిస్టో, టేల్ ఆఫ్ టు సిటీస్ మొదలయిన కధలను బొమ్మలు కధల రూపంలో
ప్రచురించడం మొదలయింది. మన భారతదేశ సంస్కృతిని, గాధలను మన
పిల్లలకు తెలియ చెప్పడానికి అనంత్ పాయ్ అమరచిత్ర కధల పేరిట
పౌరాణిక, చారిత్రక గాధలను బొమ్మలు కధలుగా ప్రచురించి , పిల్లలను
మన దేశకధల వైపు ఆకర్షింప జేశారు. ఆయనే టింకిల్ పేరిట మాస పత్రికను
వివిధ విషయాలపై బొమ్మల కధలతో ప్రారంభించారు. కొంతకాలం టింకిల్
తెలుగులోనూ వచ్చేది. మనం తెలుగు వాళ్ళం కాబట్టి, మన పిల్లలు తెలుగు
పుస్తకాలు చదివితే మనకు నామోషీ కాబట్టి కొనడం మానేశాం. అందుచేత
టింకిల్ తెలుగు ప్రచురణ ఆగిపోయింది. పిల్లల కోసం ఇంతటి మంచి పుస్తకాలను
తీసుకొనివచ్చిన అనంత్ పాయ్ మన బుడుగు రమణ గారు దిగవంతులైన రోజునే
అస్తమించడం విచారకరమైన వార్త.
ఆంధ్ర వార పత్రిక 1950 లలో పంచతంత్రం కధలను విశ్వాత్ముల నర
సింహమూర్తి గారిచే బొమ్మల కధలుగా ప్రచురించింది. ఆ బొమ్మల కధలకు
శ్రీ నండూరి రామమోహనరావుగారు గేయాలరూపంలో రచన చేశారు. ఆ పుస్తక
రూపంలో వెలువడిన ఆ పంచతంత్రం బొమ్మలకధ నేను నమ్మి అరువిచ్చి పొగొట్టుకున్న
చాలా పుస్తకాల్లో అదొకటి. అందులొ నాకింకా గుర్తు. మిత్రలాభం కధలో
లేడి వేటగాడి వలలో పడినప్పుడు, రామమోహనరావుగారు ఆ బొమ్మ పైన ఇలా
వ్రాశారు. "మేత కోసమై వలలో పడినే పాపం పసివాడు" అని ! విశ్వాత్ముల నరసింహ
మూర్తిగారు దివగంతులైతే శ్రీ బాపు మిగతా పంచతంత్రమ్ కధలను వేశారు. ఆంధ్ర
వారపత్రికలో బాపుగారు "బంగారం-సింగారం", "లంకెబిందెలు" మొదలయిన బొమ్మల
కధలను వేశారు. "గలివర్ ట్రావెల్స్" ను రంగుల్లో బాపుగారు బొమ్మల కధగా గీయగా
చందమామ లో ప్రచురించబడింది. బాపు గారి బొమ్మల కధలన్నిటినీ ఒకే చోట
చదివే అవకాశం వాహిని బుక్ ట్రస్ట్ వారు "ముళ్లపూడి వెంకటరమణ -బాపు బొమ్మల
కధలు పేరిట ప్రచురించారు.

Friday, 4 March 2011






మీరు చూస్తున్న ఈ ఫొటోలు SMALL TALK అన్న పుస్తకం
లోనివి. చిట్టిపాపాయిల ఫొటోలను SYMS అనే అనే వ్యక్తి
వేరు భంగిమలలో ఫొటోలు తీసి ఆ ఫొటోలకు చక్కని
వాఖ్యలను వ్రాసారు. దీన్ని పుస్తక రూపంలో Jaico Publishing
House వారు 1958 లో ప్రచురించారు. ఈ పుస్తకం మా నాన్నగారి
అనేక మంచి పుస్తకాల కలెక్షన్స్ లో ఒకటి. ఆ రోజుల్లో ఈ పుస్తకం
ఖరీదు రెండు రూపాయలు. ఆ పుస్తకం చివరి పేజీలలో పాఠకులను
ఇలాటి ఫొటోలను తీసి మంచి కాప్షన్ తో పంపమని ప్రచురుణకర్తలు
కోరారు. మొదటి పేజీలో ఇలా వ్రాశారు..
YOUR SWEET LITTLE ONES !
........They cannot talk. Then what ? -- Are not their
expressions angelic, unforgettable, more eloquent
than words ?
And it is this eloquence that lits up the pages
of this small book. Their "SMALL TALK " gets a
better audience than any of the "TALL TALK" on
record.
"A babe in the house is a well-spring of
pleasure, a messenger of peace and love, "-said
Tupper, the great English writer. It is the same
fashion it lends charm to each of the pages of this
book.
Ah ! their bewitching smile, their bubbling
laughter and their tears that fall like summer rains !
They bring pleasure, peace and love to a weary
world.
------- JAICO BOOKS

ఈ పుస్తకం మీకెక్కడైనా బుక్ స్టొర్సులలో
(కొత్త ఎడిషన్) అగుపిస్తె నాకు తెలియజేస్తారని తలుస్తాను.

Thursday, 3 March 2011


చాలా చాలా ఏళ్ళక్రితం తపాలాబిళ్లల కాగితాలలో ఈకాలంలో లాగ ఒక
బిళ్లకీ మరో బిళ్లకీ మధ్య బెజ్జాలుండేవి కావు. వాటిని వేరు చేయాలంటే
కత్తెరతో కత్తిరించడమో, చాకుతో కోయడమో చేయవలసి వచ్చేది. ఒక
పత్రికా విలేఖరి తన హోటల్ గదిలో కూర్చొని తన పత్రికకు పంపవలసిన
వార్తలు వ్రాయటం పూర్తయిన తరువాత ఆ కాగితాలను కవరులొ పెట్టి
అతికించాడు. కవరుపై అతికించడానికి తపాలాబిళ్లల కాగితం తీసి వాటిని
వేరుచేయడానికి చూస్తే అతని దగ్గర కత్తెర గానీ చాకుకానీ లేదు. అప్పుడు
అక్కడ దొరికిన ఓ గుండుసూది తీసుకొని ,దానితో ఆ తపాలా బిళ్లల చుట్టూ
రంధ్రాలు పొడవటం మొదలుపెట్టాడు. అదే హోటల్లో వుంటున్న అతని
స్నేహితుడు, హెన్రీ ఆర్చర్ అతని రూములోకి వచ్చి తన స్నేహితుడు
చేస్తున్న పని చూసేసరికి అతనికి మెరపులా ఓ ఆలోచన తట్టింది. స్వతహాగా
అతను ఇంజనీరు. అతను తపాలా బిళ్లలను వేరు చేయడనికి ఓ మిషను
తయారుచేయాలని అనుకొన్నాడు. కొంతకాలానికి అతనొక యంత్రాన్ని
తయారు చేసి తపాలాశాఖకు పంపిస్తే వాళ్ళు దాన్ని ఆమోదించలేదు.
అయినా అతను నిరాశ చెందక మరో ప్రయత్నం చేశాడు. చివరకు 1848
లో అతను కనుగొన్న యంత్రానికి తపాలాశాఖ ఆమోదం లభించింది.
ఆ యంత్రం 1854లో ఇంగ్లాండులోవాడుకలోకి వచ్చి ఇప్పుడు మనం
చూస్తున్న విధంగా స్టాంపులు రంధ్రాలతో వచ్చాయి!. ప్రతి కొత్త విషయం
వెలుగు చూడటానికి ఇలా అనుకోని సంఘటనలు విచిత్రంగా కలసి
వస్తుంటాయి.

Tuesday, 1 March 2011






1945 సంవంత్సరంలో ముళ్లపూడి వెంకటరావు, సత్తిరాజు లక్ష్మీనారాయణ
అనే ఇద్దరు అబ్బాయిలు మద్రాసు కేసరీ హైస్కూళ్ళో సహాధ్యాయులు.
"బాల" పత్రికలో అమ్మమాట వినకపొతే అనే కధ , బాల శతకాన్నిఒకబ్బాయి రచిస్తే ,
మరో అబ్బాయి "కవ్వపు పాట" అనే రచనకు బొమ్మ గీశాడు. వాళ్ళే పేద్దవాళ్ళయి
ఒకరేమో అక్షరాలతో ఆడుకొనే అసమాన రచయిత ముళ్లపూడి వెంకటరమణగా
మారితే మరొకరు కుంచెతో గీతాలాపన చేసే బాపుగా అవతారమెత్తారు. ఆనాటి
" బాల " లోని ఆ ఇద్దరు మిత్రుల రాత, గీతలు మీకొసం , మరోసారి.
<><><><><><><><><><><><><>
" బాల " విహంగ వీక్షణ సంచిక మొదటి భాగం (శ్రీరచన శాయి) సౌజన్యంతో.
1945 నుండి 1959 వరకు వాహినీ బుక్ ట్రస్ట్ వారు నాలుగు వాల్యూములుగా
ప్రచురించారు. 1.9.286/3, విద్యానగర్, హైద్రాబాదు-500044 వద్ద ఈ పుస్తకాలు
లభ్యమవుతాయి.
  • Blogger news

  • Blogroll

  • About