RSS
Facebook
Twitter

Monday, 16 July 2012

                     చందమామ రాగనే ముందర కధల కంటే బొమ్మలనే
                     ఆసక్తితో చూసే వాళ్ళం. చందమామ సీరియల్ కధలకు
                     దాదాపు "చిత్రా" బొమ్మలు వేసేవారు. తరువాత 1952
                     లో ఆసంస్థలో చేరిన శ్రీ శంకర్ కధలకు, పౌరాణిక కధలకు
                     బొమ్మలు అద్భుతంగా ఈనాటికీ వేస్తున్నారు. మే 1961
                      సంచికలొ మొదలై  సెప్టెంబరు 1965 వరకూ వచ్చిన
                     రామాయణం గాధకు శ్రీ శంకర్ వేసిన చిత్రాలు రామాయణ
                     కావ్యమంత కమణీయంగా వుంటాయి. శంకర్ పూర్తి పేరు
                     కె.సి.శివశంకరణ్ 1924లో ఈరోడ్ దగ్గరగల ఊర్లో పుట్టారు.

                           చిన్న వయసులోనే 1934 లో ఆయన కుటుంబం మద్రాసు
                     వచ్చారు. ఆయన దస్తూరీ చలా అందంగా వుండటం చూసి
                     స్కూళ్ళో టీచర్ శంకర్ చేత ప్రతి రోజూ బోర్డు మీద సూక్తులు
                     వ్రాయించే వారట. చందమామ సంస్థలో చిత్ర, శంకర్ ఇద్దరూ
                     ఒకరికి ఒకరు పోటీగా వున్నా తరువాత మంచి స్నేహితులు
                     గా మారారు. చందమామ అధిపతి నాగిరెడ్డి గారు  "చిత్రా ,
                     శంకర్ లు చందమామ అనే బండిని లాగే జోడెద్దులు" అనే
                     వారు..1952లో నెలకు 350 రూపాయల జీతంతో శంకర్
                      చందమామ లో ఆర్టిస్టుగా చేరారు.





                              88 ఏళ్ళ వయసు వచ్చినా , Arthritis తో ఆయన వేళ్ళు
                     ఇబ్బంది పెట్టినా చందమామకు ఆయన ఇంటి దగ్గరే అందంగా
                     బొమ్మలు వేస్తున్నారు. ఆయన ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి
                      చెన్నైలో వుండగా మరో ఇద్దరు అబ్బాయిలు ఒకరు కెనడాలో
                     మరొకరు మలేసియాలో వున్నారు. శంకర్ మరెన్నో బొమ్మలతో
                     చందమామ పాఠకులను అలరించాలని కోరుకుందాం.
                     బొమ్మలు చందమామ , శ్రీ శంకర్ సౌజన్యంతో

Sunday, 15 July 2012

గోదావరి కధలు



              గోదావరి అందాలు ఒక్కో చోట ఒక్కోలా అందాలు కురిపిస్తాయి.
              బాపు రమణగార్ల చిన్ననాటి ఆప్త  మిత్రుడు     శ్రీ బివి.యస్
              రామారావు గారు ( ఆయన్ని  మిత్రులిద్దరు సీతారాముడుఅని
              ఆప్యాయంగా పిలుచుకుంటారు) "  గోదావరి తీరం ఆలంబనగా
              అందమైన 13 కధలు ఆయన  ఆంధ్రజ్యోతి లో వ్రాసారు..అవి  
              " గోదావరి కధలు " పేరిట పుస్తక రూపంలో మన  ముందుకు
              వచ్చాయి.



              శ్రీ ముళ్లపూడి వెంకటరమణ ముందు మాట వ్రాస్తూ ఒక చోట
              ఇలా అంటారు. " ధవళేశ్వరంలో ఇంజనీరుగా పనిచేస్తూ  ఒక
              సారి బురదలా కనిపించిన ఊబిలోకి దూకేసి రెండు ప్రాణాలు
              కాపాడి - తను ఖర్చుకాబోయాడు. ఈకధలు రాయటం కోసం
              ఆ తల్లి వీడిని ఒడ్డెక్కించింది. ఈకధలు గోదారికి   అక్షరాను
              వాదాలు. ఇవి బాల గోదారిలా పరవళ్ళు తొక్కుతాయి.పడుచు
             గోదారిలా ప్రేమను పంచి పెడతాయి.":   చివరగా ఇలా అంటారు.
                     "నాకు వీడంటే అసూయ-----
                      టెలుగు మాత్రం తెలిసిన వారికి - ఆంగ్లంలో ఐయాం
                      జెలస్ "





                      గుండెల్లో గోదావరి కధలో అప్పుడే పెళ్ళయిన నూతన వధూ
             వరులు ఒక్కసారిగా వచ్చి ముంచెత్తిన గోదారిలో ఎలా కొట్టుకు
             పోతూ దగ్గరయ్యారో చదివితే మనమూ ఆకధలో   పూర్తిగా
             వారితో బాటు మునిగి తేలుతాం. ఎసరూ అత్తెసరూ కధలో
             వర్ధనమ్మ బామ్మగారు వరదగోదారిలో పుల్లలు ఏరుకొచ్చే
              సత్తిగాడు పుల్లలకోసం వెళ్ళి ఎంతకీ   రాక పోయేసరికి
            ఆవిడ ప్రాణం ఎంత తల్లడిల్లిందో, చివరికి వాడిని చూసిన
            తరువాత వాడికోసం బెంగ  పడి ప్రాణాన్ని ఎలా వదిలిందో
            సీతారాముడు గారి కధ చదివితే కళ్ళు చెమరుస్తాయి
             అద్దరి ఇద్దరి కధలో ఫారెస్ట్ ఆఫీసరు చేసిన నిర్వాకం రాత్రి
             ఇంటికి తిరిగొచ్చిన తరువాత జరిగిన సంఘటన మన కళ్ళను
             అతని కళ్ళతో బాటు చెమ్మగిల్లేలా చేస్తాయి. ఇలా ప్రతి ఒక్క
              కధా పాఠకుల్ని మైమరపిస్తాయి గత నెల జూన్ 30 న
             హైద్రాబాదు హాసం క్లబ్ నూరవ కార్యక్రమం శ్రీ ముళ్లపూడికి
             అంకితం చేసిన సంధర్భంలో శ్రీ బివియస్ రామారావుగారిని
             సత్కరించారు. ఆనాటి సభలోవారిని  కలుసుకొని    నేను
             తయారు చేసిన బాపు రమణగార్ల   ఆల్బమ్స్ లో ఒకటి
             చూపించే అదృష్టం కలిగింది.   ఎమెస్కో ప్రచురించిన ఈ
             గోదావరి కధలు కధాప్రియులంతా తప్పక చదవాలి.

Monday, 9 July 2012

శ్రీ బాపు " ముఖ " చిత్రాలు

           బాపుగారి కార్టూన్లతో బాటు గీసిన దేముళ్ళు ఇంత అందంగా వుంటారా
            అనుకుటేట్టు, ఆయన సృష్టించిన అందమైన బొ(అ)మ్మాయిలు,(వాళ్ళనే
             " బామ్మ" లు అని ముద్దుగా పిలుస్తారు)  చూసి ముగ్ధులవని  వారు
            వుండరు కదా !.    శ్రీ బాపు ప్రముఖుల "ముఖ" చిత్రాలు వాళ్ళ ఫొటోల
            కంటే అందంగా గీశారు. వాటిల్లో కొన్నిటిని మీ ముందు చుంచుతున్నా. 
                         శ్రీ నండూరి రామమోహనరావు

                          శ్రీ అక్కినేని

                        శ్రీ నందమూరి తారక రామారావు

                                   శ్రీ బాపు స్వీయ చిత్రం

                                                       శ్రీ రాచకొండ విశ్వనాధ శాస్త్రి (రావి)


  శ్రీ బాపుగారికి కృతజ్ఞతలతో       

Thursday, 28 June 2012


               


                             హాస్యమందు అఋణ
                             అందెవేసిన కరుణ
                             బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా !! అంటూ తమ కూనలమ్మ పదాలలో ఆరుద్ర అన్నారు. అంతేకాదు రమణగారికి పెళ్ళి కానుకగా, శ్రీదేవి గారికి తోడుగా అందించారు.
  
రమణగారికి గోదావరి అంటే ఎంతో ఇష్టం. అందుకే బాపురమణలు  తమ సినిమాల్లో గోదావరిని మరింత అందంగా చూపిస్తారు.1956 నవంబరు నుండి 1957 ఏప్రియల్ వరకు ఆంధ్ర సచిత్ర వార పత్రిక ప్రచురించిన ఆయన " బుడుగు-చిచ్చుల పిడుగు" ధారావాహికగా వచ్చినప్పుడు నా వయసు 15 ఏళ్ళు ! ఆనాటివేలాది పాఠకులతో బాటు వారం వారం బుడుగు చేసే అల్లరి కోసం ఎదురుచూసే వారం బుడుగు అమ్మ,నాన్న రాధాగోపాలం, గర్ల్ ఫ్రెండు సీగానపెసూనాంబ, బాబాయి, రెండు జెళ్ళసీత,లావుపాటి పిన్నిగారు, ఆవిడ మొగుడు, ప్రైవేటు మాస్టారులు , మధ్యలో వచ్చే డికిస్టీ వాడు ఇలా ఎన్నేన్నో పాత్రలు !


 బుడుగు వీక్లీలో వచ్చే రోజుల్లో రచయిత ఎవరో మాలాటి వాళ్ళకి చివరివరకూ తెలియలేదు. చివరాఖరికి బుడుగు చెబుతాడు "ఇది రాసి పెట్టినవాడు ముళ్లపూడి వెంకటరమణ , బొమ్మలు వేసినవాడు బాపు " అని ! ఆనాటి నుంచే బాపు రమణ గార్లంటే విపరీతమైన అభిమానం. ఆరాధన.! తరువాత దాదాపు  50 ఏళ్ల తరువాత  2005లో బాపురమణ గార్లను కలిసే అదృష్టం కలిగింది. 2008 లో వచ్చిన నా "సురేఖార్టూన్స్ " పుస్తకానికి నా అభిమాన రచయిత శ్రీ ముళ్లపూడి జుబ్లీబాయ్ జిందాబాద్ అంటూ ముందు మాట వ్రాసారంటే అది నాకు వారిద్దరి ఆరాధ్యదైవం శ్రీరాముడి కృపే !

                              
ఆయన రచనలు ఎన్నని చెప్పగలం ! ప్రతిదీ అద్భుతమే ! రాధా గోపాలం, ఇద్దరమ్మాయిలూ -ముగ్గురబ్బాయిలూ ,ఋణాలందలహరి, విక్రమార్కు సింహాసనం లతో బాటు ఎన్నో పిటీ 109 లాటి అనువాదాలు వున్నాయ్. శ్రీ ముళ్ళపూడి సాహితీ సర్వస్వం ఎనిమిది సంపుటాలుగా  శ్రీ యమ్భీయస్ ప్రసాద్ గారి సంపాదకత్వంలో వెలువడి వీశేష ఆదరణ పొందింది. ఋణానందలహరిలో ఆయన పంచతంత్రంలోలా జంతువుల చేత తెలుగు మాట్లాడిస్తారు! కాకులు ఆవులించవు, కావులిస్తాయి., కావు కేకలు పెడతాయి. బావురమని ఏడవవు ! కావురమని ఏడుస్తాయి.
 అవి "రెక్కా"డితేగాని డొక్కాడనవి ! ఒకరితో ఒకరు  కాకమ్మ కబుర్లు చెప్పుకుంటాయి. ఇలా ఎన్నో చమత్కార ప్రయోగాలు చేశారు.

 రమణగారి చేత మొట్టమొదటి సినిమా స్క్రిప్ట్ "దాగుడు మూతలు" చిత్రానికి శ్రీ డి.బి.నారాయయణ వ్రాయించారు. కాని రమణగారు వ్రాసిన రెండో చిత్రం " గుడిగంటలు" మొదట విడుదలయింది. హాస్యం వ్రాసే రమణ ఇలాటి బరువైన కధా చిత్రానికి.మాటలు రాయడమా అని  విమర్శించిన వారే సినిమా విడుదలయాక ముళ్ళపూడిని మెచ్చుకున్నారు.అందాలరాముడు,బుద్ధిమంతుడు, ముత్యాల ముగ్గు, సీతాకళ్యాణం ( ఈ చిత్రం అంతర్జాతీయ ప్రశంసలందుకొంది ).లాటి ఆణిముత్యాలు తెలుగు తెరకు అందించారు. చిన్నతెరకు ఆయన వ్రాసి బాపు అందించిన శ్రీ భాగవతం 100 ఎపిసోడ్స్ ఈటీవీ ద్వరా శ్రీ రామోజీరావు సమర్పించారు..


శ్రీ భాగవతం లో ఒక పాటకు ఆయన మాటల గారడీ ఇలా ఓ నదిలా సాగిపోతుంది.
                                         గలగల పారెడు నది యిది
                                         కిలకిల నవ్వించు"నది"  ఈ
                                         వలపుల కౌగిలి మ"నది"-చలి
                                         గిలగిలగిలల నలిగి "నది".......
  శ్రీ రమణగారు "సాహితీ సర్వస్వం " పుస్తకం నాకు కానుకగా సంతకం చేసి ఇస్తూ క్రింద బాపు అని కూడా వ్రాసి బ్రాకెట్లో "ఆధరైజ్డ్ ఫోర్జరీ" అని చేర్చటం ఆయన అక్షరాలతో ఆటలాడుకుంటారనడానికో మచ్చుతునక. ఆయన అక్కినేని జీవితాన్ని కధానాయకుడు కధ పేరిట వ్రాశారు. ఆయన తన ఆత్మ కధ కాని కధను రమణీయంగా "కోతి
 కొమ్మచ్చి" పేరుతో స్వాతిలో వ్రాశారు. ఈ కధ మామూలు ఆత్మకధ కాదు. ఈనాటి యువతరానికి వాళ్ళు ఎదుర్కొనే కష్టాలను, నష్టాలను ఇష్టాలుగా మార్చుకొని ధైర్యంగా ముందుకు సాగించేందుకు తోడ్పడే అద్భుత టానిక్ ! ’కోతికొమ్మచ్చిమీరు తెలుగు తెలిసి చదవటం రాక పోయినా హాయిగా బాలుగారి గొంతులో వినొచ్చు. వివరాలకు www.kothikommachi.com కు వెళితే సరి !! రమణగారూ మీరు నెలకొకసారైనా ఫోన్లో పలకరించేవారు. ఇప్పడు నాలాటి వేలాది గుండెల్లో నిత్యం  నిలచి పలకరిస్తున్నారు !! మీ నవ్వితే నవ్వండి జోకులు గుర్తుచేస్తూ నవ్విస్తున్నారు. మీరు చిరంజీవి !!
           
                         
                   
                           
                           
                          

Thursday, 21 June 2012

ఆలాపన


                                              సరాగమాల శ్రీ విఏకె. రంగారావుగారు

శ్రీ ముళ్లపూడి వెంకట రమణగారు చెప్పిన సంగీతం జోకు:  న్యాయమూర్తి ఒక కేసులో ముద్దాయికి శిక్ష విధించబోతూ  "నిన్నెక్కడో చూచినట్టుందే, ఎక్కడ చెప్మా" అన్నాడు. "చిత్తం, మీరు ప్లీడరుగా వున్నప్పుడు మీ రెండో అమ్మాయికి  సంగీతం చెప్పడాని కొచ్చే వాడినండి...." "అలాగా! అయితే యిరవై ఏళ్ళు ఖైదు విధిస్తున్నాను."

 సంగీత ప్రియులందరికీ ప్రపంచ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు  తన కుంచెతో అందంగా "గీతా"లాపన చేసిన మా బాపుగారికి కృతజ్ఞతలతో 
  • Blogger news

  • Blogroll

  • About