RSS
Facebook
Twitter

Wednesday, 31 March 2010

గుళ్ళూ-గోపురాలు: ర్యాలి

తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కోనసీమలోని కొత్తపేటకు పది మైళ్ళ దూరానగల ర్యాలి అనే ఊర్లో జగన్మోహినీ కేశవస్వామి తప్పక చూడ దగ్గ గుడి. అధ్యాత్మక చింతనకు కళ తోడైతే ఎంత అద్భుతంగా వుంటుందో అన్నదానికి ఈ ఆలయమే సాక్షి. ఐదు అడుగుల ఎత్తుగల జగన్మోహినీ విగ్రహం నిగనిగ లాడుతూ నల్లటి శిలతో...

Tuesday, 30 March 2010

జ్ణాపకాలు-"తోకచుక్క"

1953 నవంబర్ చందమామ దీపావళి ప్రత్యేక సంచికలో 'పొట్టి పిల్ల' అనే కధ మొట్టమొదటి సారిగా రంగుల్లో ప్రచురించారు.చందమామ బొమ్మలను రెండు రంగుల్లో చూసే మాకు, అలా ఆ కధ బొమ్మలను రంగుల్లో చూడటం ఎంతో సంతోషం కలిగించింది. 1954 జనవరి నెల సంపాదకీయంలో 'తోకచుక్క' రంగుల్లో వేయగలిగాం అని వ్రాసినప్పుడు మా ఆనందానికి హద్దులు లేవు.ఆ సీరియలుకు...

Monday, 29 March 2010

ఆ నాడు--ఈనాడు

ఈనాడు తెలుగు దేశం అవిర్భావ దినోత్సవమని పేపర్లలో చదివి మొదటి సారి తెలుగు దేశం గెలిచినప్పటి "ఈనాడు" పేపర్ను బయటికి తీసాను.ఆనాడు పేపర్ మూడు కేంద్రాలనుంచే ప్రచురించబడేది.అప్పటికే (1983) అత్యధిక సర్కులేషన్ గల పత్రికగా పేరు పొందింది.ఖరీదు 50 పైసలు. ఆనాటి జ్ణాపకాలను మీతో పంచుకోవాలని ఆనాటి "ఈనాడు" ను ఈనాడు మీ ముందుకు ...
హనుమత్ జయంతి పంచాంగాలలో చూస్తుంటే రకరకాల తేదీలు అగుపిస్తున్నాయి. భగవంతుడికి భక్తుల దృష్టిలో నిత్యం జన్మదినాలే!ఆంజనేయుని జయంతి ఎప్పుడైనా ఆయన కరుణా కటాక్షాలు మన అందరిపైనా సదా ఉండాలని కోరుకుందాం. ఈ సంధర్భంలో హైదరాబాదు పాత బస్తీలో గొడవలు చెలరేగటం బాధాకరం.ఎందుకో నాకు గతంలో ఓ ముఖ్య మంత్రిని దింపటానికి జరిపిన ప్రయత్నాలే...

Sunday, 28 March 2010

" నవ్వవు జంతువుల్, నరుడు నవ్వును, నవ్వులు చిత్తవృత్తికిన్ దివ్వెలు... పువ్వుల వోలె ప్రేమ రసమున్ వెలిగ్రక్కు విశుద్ధమైన లే నవ్వులు సర్వ దు:ఖ దమనంబులు వ్యాధులకున్ మహౌషధములు" అన్నారు జాషువా. మన తెలుగు వాళ్ళం నిజంగా ఎంతో అదృష్టం చేసుకున్నాం.చిలకమర్తి,మొక్కపాటి, భమిడిపాటి కామేశ్వరరావు,వాళ్ళబ్బాయి రాధాకృష్ణ,మన...

Saturday, 27 March 2010

శ్రీ " బ్నిమ్ " గారిని కార్టూనిస్ట్ గా తెలుసు.అలానే మంచి రచయితగా,హ్యూమరిస్ట్ గా కూడా తెలుసు కదా?! గత ఆగస్ట్ లో నేను శ్రీ బాపు రమణ గార్లను కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అని వ్రాసి సంతకం చేసి ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. నిజంగా అది ఓ అద్భుతమైన కానుక.ఇంతకీ ఆ పుస్తకమే శ్రీ బ్నిమ్ వ్రాసిన మిసెస్ అండర్ స్టాండింగ్....

Friday, 26 March 2010

కార్టూనా? కళాఖండమా?!!

స్వాతి సపరివార పత్రిక వారం వారం బాపు గారి పంచ(వర్ణ)రత్నాల కార్టూన్లను ప్రచురిస్తుంది. ఈ వారం ( 2-4-2010) సంఛికలో ఐదు కార్టూన్లు దేనికదే బాగున్నా ఇక్కడ మీరు ఛూస్తున్న కార్టూన్ చూస్తే అందులో మీకు ఓ చక్కని కార్టూనే కాకుండా ఓ రంగుల వర్ణ చిత్రం అగుపిస్తుంది. సినీమాల్లో చిన్న వేషాలేసి చిన్న ఊర్లో విశ్రాంతి తీసుకోంటున్న...

Thursday, 25 March 2010

ఇప్పుడు ఏ వార పత్రిక చూసినా అట్టమీది బొమ్మ గ్లామరస్ హీరోయిన్ బొమ్మే అగుపిస్తుంది. అదీ సాధ్యమైనంతవరకూ సెక్సీగా వుంటుంటుంది.ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావటానికి ఇదో మార్గం గా అగుపించక తప్పడం లేదు. పత్రికలోపలి అంశాల కంటే పై బొమ్మను చూసే కొనే పాఠకులు ఎక్కువయ్యారు. పాటలు ఎలా వున్నా కవరు పై హీరో...

Wednesday, 24 March 2010

SRI RAMA KADHA

మన బ్లాగర్లందరకీ శ్రీ రామనవమి శుభాకాంక్షలు. నిన్ననే మన బ్లాగరు శ్రీమతి జ్యోతి గారు శ్రీ రామ నవమి సంధర్భంలో రామచంద్రుడి గురించి, సీతమ్మ తల్లి గురించి ఎన్నో మంచి విషయాలు చెప్పారు. శ్రీ జేసుదాసు పాడిన రాముడి పాటలు వినిపించడమే కాకుండా చూపించారు. ఈ రోజు నేనూ శ్రీ రాముడిని తలచుకుంటూ కొన్ని విషయాలు చెబుతాను. శ్రీ రాముడు తెలుగువాళ్ళ...

Tuesday, 23 March 2010

మా హాసం క్లబ్ గురించి ఇదివరలో చెప్పాను.2004 ఉగాది నాడు నేనూ ,నా బ్యాంకు కొలీగ్ మా ఫామిలీ మితృడు దినవహి వెంకట హనుమంతరావు కలసి హాసం క్లబ్ ప్రారంభించాము. మా ఇద్దరకీ హాస్య మంటే ఎంతో ఇస్టం. నాకు కార్టూన్లు గీయడం పవృత్తి ఐతే ,హనుమంతరావుకి హాస్య ప్రసంగాలు,రచనలు చేయటం అభిలాష. హాసం క్లబ్ నిర్వహణలో సహకరించే మరో మితృడు రెటైర్డ్ పోస్ట్మాస్టారు...

Monday, 22 March 2010

తెలుగోడి గోడు

తెలుగోడి గోడు అదేమిటొ గాని తెలుగంటే మన తెలుగువాళ్లకే చిన్న చూపు.ఎవరైనా తెలుగులో మాట్లాడుతున్నాడంటే అతను ఎంత ఉన్నత చదువులు చదివిన వాడైనా ఏవీ రాని అనాముకుడిక్రిందే లెక్క కడతారు మన తెలుగు వాళ్ళు. ఈ మధ్య మనం వార్తల్లో చదువుతూ,వింటూ వున్నాం. బడిలో తెలుగు మాట్లాడారని పిల్లల్ని ఘోరంగా శిక్షిస్తున్నారట ఉపాధ్యాయులు. ఇక ఇంట్లో అమ్మా,...

Sunday, 21 March 2010

44 ఏళ్ళ క్రితం నేను బాపట్ల స్టేట్ బ్యాంక్ లో కాషియర్ గా పనిచేస్తున్న రోజుల్లో నేను వేసిన ఈ కార్టూన్ ఆంధ్రప్రభ వీక్లీలో పడింది. ఈ కార్టూన్ 2008 లో అచ్చయిన " సురేఖార్టూన్స్" పుస్తకంలో మరోసారి చూసిన మితృలు శ్రీ జయదేవ్ చాల మెచ్చుకున్నారు. ఆ నాడు అచ్చయినప్పటి కంటే శ్రీ జయదేవ్ బాగుంది అన్నప్పుడు ఎన్నో రెట్లు ఆనందించా . ...

Saturday, 20 March 2010

పిచ్చుకమ్మా రావమ్మా

పిచ్చుకమ్మా రావమ్మా ఓ నాడు ప్రతి ఇంట్లో సందడిగా కిచ కిచారావాలతో అద్దమ్ ముందు కూర్చొని తన అందాలను చూసుకుంటూ సంబరపడే పిచ్చుకమ్మ ఇప్పుడు అగుపించడమే లేదు. పెరిగిపోయిన కాలుష్యం, సెల్ టవర్లు, బహుళ అంతస్తుల నివాసాలు వాటిని మన నగరాలనుంచి దూరం చేశాయి. ఇక గ్రామాలలో పైరులకు వాడే క్రిమి సంహారకమందులు కూడా వాటి సంతతి తగ్గిపోవడానికి మరో కారణం. కానీ విచిత్ర మేమిటంటేఎప్పుడూ...

Friday, 19 March 2010

నవయుగ వైతాళికుడు శ్రీ కందుకూరి వీరేశలింగం వేదంలాంటి గోదావరి తీరంలో ఎందరో పండితులూ, కవులూ, కళాకారులూ, కధానాయకులూ జన్మించారు. అలానే ఈ గోదావరి ఒడ్డునున్న రాజమహేంద్రవరం(రాజమంద్రి)లోనే రాజరాజ నరేంద్రుడు ఆదికవి నన్నయ చేత మహాభారత రచనకు శ్రీకారం చుట్టించాడు. అలాటి ఈ సాహిత్య నగరంలో 16-4-1848 లొ ఈ యుగపు సంఘసంస్క్రర్త కందుకూరి వీరేశలింగం జన్మించారు. 1919 లో మరణించే వరకూ కందుకూరి...

Thursday, 18 March 2010

ఎవరీ బాల ? ఏమా కధ ? పందొమ్మిది వందల నలభై ఏడు, ఏప్రియల్ "బాల" సంచికలోని "తెనుగు దేశం" సంపాదకీయం (తెలుగువారికి ప్రత్యేక రాస్ట్రం) గురించి చెఫ్ఫాను. అసలీ "బాల" పత్రిక గురించి ఈనాటి తరం వారికి కొందరికి తెలియక పోవచ్చు. "చందమామ" కు ముందు "బాల" పత్రిక పందొమ్మిది వందల నలభై ఐదు ఆగస్టులో పిల్లలకోసం శ్రీ న్యాయపతి...

తెనుగు దేశం

తెనుగు దేశం-- తొలి ముఖ్య మంత్రి టంగుటూరి ప్రకాశంఈ బాల లోనే ఇంకోచోట "తెలంగాణాలో కోటి మంది ఆంధ్రులు" అన్న రచన పడింది. అది చదివితే నైజాంసంస్తానంలో మన తెనుగు వారు పడుతున్న కస్టాలు తెలుస్తాయి. అలాగే మన తెలుగు దేశం కొంత భాగంఒరిస్సా రాస్ట్రంలో కలసిపోయి,అక్కడ మనతెనుగువారు చాలా కస్టాలు పదుతున్నారు. మైసూరు రాజ్యంలోకొన్నిభాగాలు తెనుగువారివి....

దేముడే దిగివచ్చిన వేళ !!

సాధారణంగా వివాహాలు దేముడి సన్నిధిలో చేయలని కొందరు నిర్నయిస్తుంటారు. ఏ అన్నవరం సత్యనారయణ స్వామి వారి గుడిలోనో,తిరుమలలో ఏడుకొండలవాడి సన్నిధిలోనో చేస్తుంటారు. మా రాజమండ్రి లోని ఓ ప్రముఖులు తమ ఇంటిలోని పెళ్ళికి సాక్షాత్తూ ఆ ఏడుకొందలస్వామి దేవాలయాన్నే రాజమండ్రి లో ప్రతి సృష్టి...

Wednesday, 17 March 2010

లక్ష్మణ రేఖలు

ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ పూర్తి పేరు రాసిపురం క్రిష్ణస్వామి లక్ష్మణ్. ఆయన పుట్టిన మైసూర్ లోనే విద్యాభ్యాసము చేశారు. విద్యా పూర్తయిన తరువాత బొంబాయిలోని ఫ్రీప్రెస్ జర్నల్ వార్తా పత్రికకు కార్టూనులు గీయటం ప్రారంభించారు. తరువాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు కార్టూన్ ఎడిటరు గా ఉద్యోగంలో చేరారు. ...

Tuesday, 16 March 2010

వ్యంగ చిత్ర మారార్ఠీ మాంత్రికుడు శ్రీ యస్.ఫడ్నీస్మహరాషట్రకు చెందిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ యస్.ఫడ్నీస్ గీసిన వ్యంగ చిత్రాలుచూసి ఆనందించాలంటే మనకు మరార్ఠీ భాష రానవసరం లేదు. ఆయన బొమ్మల్నిఏ దేశం వాళ్ళాయినా ఏ భాష మాట్లాడే వారైనా చూసి నవ్వకుండా ఉండలేరు!ఏ మంటే ఆయన బొమ్మలన్నీ మూకీలే ! అంటే బొమ్మల్ని చూడగానే అందులోనివ్యంగ్యం అర్ధమైపోతుంది. ప్రముఖ సినీ దర్శకులు...
  • Blogger news

  • Blogroll

  • About