RSS
Facebook
Twitter

Wednesday, 31 March 2010

గుళ్ళూ-గోపురాలు: ర్యాలి




తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. వాటిలో కోనసీమలోని
కొత్తపేటకు పది మైళ్ళ దూరానగల ర్యాలి అనే ఊర్లో జగన్మోహినీ కేశవస్వామి తప్పక చూడ
దగ్గ గుడి. అధ్యాత్మక చింతనకు కళ తోడైతే ఎంత అద్భుతంగా వుంటుందో అన్నదానికి ఈ
ఆలయమే సాక్షి.
ఐదు అడుగుల ఎత్తుగల జగన్మోహినీ విగ్రహం నిగనిగ లాడుతూ నల్లటి శిలతో చెక్క
బడింది.ఆ శిల్ప సౌందర్యం స్వయంగా చూడవలసినదే గాని మాటల్లో చెప్పటం సాధ్యం కాదు.
కేశవస్వామి చేతులు,పాదాలు,ప్రతి అవయవము ఎంతో సహజముగా చెక్కడం చూస్తే ముగ్ధు
లవుతాము.అరచేతుల్లోని రేఖలు, మెడ మీది మడతలు,చేతి గోళ్ళూ,ఒకటెమిటి ప్రతిదీ ఓ
అద్భుతమే!ఇక ఆ మూర్తి పాదాలనుంచి ఉద్భవించే జలం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది.
నిత్యం కొంచెం కొచెంగా చెమరించే స్వామి పాదోదకం గంగా తీర్ధంగా భావిస్తారు.మరో విశేషమేమంటే
విగ్రహం వెనుక భాగం మోహినీ రూపంగా చెక్కబడింది!ఆమె సిగ అలంకారాలు నిజమా అన్నట్లు
చెక్కిన శిల్పి చాతుర్యం అమోఘం.పద్మినీ జాతి స్త్రీకి ఉండే పుట్టుమచ్చ కాలి పిక్క మీద మనం
చూడవచ్చు.
కొత్తపేటకు వెళ్ళాలంటె రాజమండ్రి స్టేషన్లో దిగి అక్కడే ఆగే బస్సుల ద్వారా సులువుగా వెళ్ళొచ్చు.
మరో విశేషం విగ్రహంలోని ప్రతి భాగాన్నీ పూజారులు మనకు దీపం వెలుగులో శ్రద్ధగా చూపిస్తారు.

0 comments:

Post a Comment

  • Blogger news

  • Blogroll

  • About