ఈ రోజుతో నా బ్లాగు మొదలుపెట్టి ఏడాది పూర్తయింది.
               నా బ్లాగు ఇంతకాలం విజయవంతంగా నిర్వహించడానికి
               సాయం చేసినముగ్గురు త్రిమూర్తులకు నా ధన్యవాదాలు 
                తెలియజేయడంనా కనీస ధర్మం.  
               పూనాలో నివాసముంటున్న శ్రీ భమిడిపాటి ఫణిబాబు,
               శ్రీమతి లక్ష్మి దంపతులు.కొంతకాలం గోదావరీ తీరంలో
               (వారిది మా గోదావరి జిల్లాయే) గడపాలనే సదుద్దేశంతో
               రాజమండ్రి వచ్చి ఇటీవలే తిరిగి పూనా వెళ్ళారు. ఇక్కడ
               వుండగా ఓ మూడో ఆదివారం మా "హాసం క్లబ్" కు నవ్వులు
               పంచుకోడానికి వచ్చారు. మా ఇంటికి వచ్చి నా పుస్తకాలు,
               అలనాటి చందమామలు, గ్రామఫోన్ రికార్డులు చూసి అమితంగా
               ముచ్చట పడటమే కాకుండా నన్నో బ్లాగు ప్రారంభించమని
               ప్రోత్సహించారు. కంప్యూటర్లో ఈ మైల్ ఇవ్వడ తప్ప నాకు 
               మరేమీ తెలియదు మహప్రభో అంటే వినకుండా వారింటికి
               వెళ్ళినప్పుడు బ్లాగులో నా ఖాతా తెరిచి జ్యోతి గారికి( గారు
               అంటే మా చి"సౌ"జ్యోతికి మా చెడ్డ కోపం వస్తుంది)  పరిచయం
               చేశారు. నేను బొమ్మలు,ఫొటోలు, కధనాల్ని మైల్ చేస్తే జ్యొతి
               గారు, సారీ అమ్మాయి జ్యోతి అందంగా నా బ్లాగులో వుంచేవారు.
               సాహిత్య అభిమాని,మన తెలుగు చందమామ బ్లాగులను
               అద్భుతంగా నిర్వహించే శ్రీ శివరామప్రసాద్ గారు బెంగళూర్ నుండి
               విజయవాడ వస్తూ నన్ను కలవడానికి జనవరి 17 వ తేదీన
               రాజమండ్రి వచ్చారు. నా కీ గ్రామఫోన్ ఫొటో తీసి నా చేత ఆ
               రోజు బ్లాగును పోస్ట్ చేయించారు.అలా ఆయనా నా గురువు
               గారే! తరువాత కూడా ధైర్యం చాలక బ్లాగు మేటర్ చి.జ్యోతికి
               మెయిల్ చేస్తుండేవాడిని. ఒక రోజు ధైర్యం చేసి నేనే పోస్ట్
               చేయడం ప్రారంభించా. నా బ్లాగు ప్రారంభించాక ఎందరో
               బ్లాగర్లు మితృలయ్యారు. వారిలో "చిత్రచలనం" బ్లాగును
               నిర్వహించే శ్రీ బి.విజయవర్ధన్ ఒకరు. నాకు పుస్తకాలు
               కార్టూన్లంటే ఇష్టమని The cartoon Craft of R.K.Laxman
                   and Bal Thakeray అనే పుస్తకాన్ని కానుకగా పంపించారు.
                   ఈ పుట్టిన రోజు సంధర్భంగా దేశవిదేశాల్లో వున్న బ్లాగర్
               మితృలందరికీ నా శుభాభినందనలు.
                ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోలు మా ఇద్దరమ్మాయిలు
               చి.సౌ.మాధురి,చి.సౌ.మాధవి, దేముడిచ్చిన మా మూడో
               అమ్మాయి చి.సౌ.జ్యోతి.వి  ( ఓ సారి మీకు శ్రమిస్తున్నాను
               అని వ్రాస్తే "అలా ఐతే నే వ్రాయనంతే" అంటూ మా అమ్మాయిలను
               గుర్తుచేసారు). మిగిలిన రెండు ఫొటోలు శ్రీ భమిడిపాటి దంపతులు,
               శ్రీ శివరామప్రసాద్ మా ఇంటికి వచ్చినప్పటి తీపి గుర్తులు!

















.jpg)











 
 
 
 
 
 
 
 
 








